టాలీవుడ్‌కి క్యూ కడుతోన్న అక్కడి హీరోయిన్లు.. 

TV9 Telugu

15 February  2024

దీపికా పదుకొణె కెరీర్‌లో తొలిసారి తెలుగు స్ట్రెయిట్‌ మూవీలో నటిస్తోంది. ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీ ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ఇక ఎన్నో ఏళ్ల తర్వాత శ్రీదేవీ తనయ అందాల తార జాన్వీ కపూర్‌ తెలుగులో నటిస్తోంది. ఎన్టీర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంతో జాన్వీ నటిస్తోంది. 

మాళవికా మోహన్‌ తెలుగు ఎంట్రీ కాన్ఫామ్‌ అయ్యింది. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. 

పుణెకే చెందిన మోడల్‌ భాగ్య శ్రీ భోర్సె తెలుగు తెరకు పరిచయం కానుంది. రవితేజ హీరోగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రానున్న మిస్టర్‌ బచ్చన్‌లో నటించనుందీ బ్యూటీ. 

ఇక 2017లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మానుషీ చిల్లర్‌ కూడా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఆపరేషన్‌ వాలెంటైన్‌లో నటిస్తోంది. 

ప్రీతి ముకుందన్‌ కన్నప్ప సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మలయాల బ్యూటీ ఇవానా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. సెల్ఫిష్‌ అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. 

 ఇక శ్రీనిధీ శెట్టి సైతం తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తెలుసు కదా అనే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.