16 August 2023

భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ మొదట ఆ హీరోయిన్‌ను అనుకున్నారట

Pic credit - Instagram

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. భారీ అంచనాలమధ్య ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 

కానీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. 

అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది. అన్న చెల్లెలి మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయి. 

అయితే ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ మూవీకి రీమేక్ గా వచ్చింది. మెహర్ రమేష్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు.

కానీ అది బెడిసి కొట్టింది. భోళాశంకర్ మెగా ఫ్యాన్స్ ను కూడా దారుణంగా నిరాశపరిచింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.

ఇదిలా ఉంటే భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ కంటే ముందు సాయి పల్లవిని చిరు సిస్టర్ గా అనుకున్నారు. 

అయితే చిరంజీవి చెల్లెలిగా నటించేందుకు సాయి పల్లవి నో చెప్పిందట. ఆయన పక్కన నటించే స్థాయి తనకు లేదు అంటూ గౌరవం కారణంగా సాయి పల్లవి ఆ పాత్రకు నో చెప్పిందట. 

దాంతో ఆమె ప్లేస్ లోకి కీర్తిసురేష్ ను తీసుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలు తగ్గించింది. చిరవిగా గార్గి అనే సినిమా చేసింది.