14 August 2023

రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించింది.

ప్రస్తుతం కీర్తి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

అలాగే తమిళంలో మామన్నన్ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో, వరస అవకాశాలతో మధ్యలో సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది.

అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా కీర్తి భిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తాను వేరని నిరూపించుకుంటుంది. 

వేదాళం రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ మూవీలో చెల్లి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. చెల్లి పాత్ర చుట్టూనే సినిమా మొత్తం ఉంటుంది. 

అయితే భోళా శంకర్ సినిమా కోసం కీర్తి సురేష్ ఏకంగా రూ.1.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇదే జోష్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా రెమ్యూనరేషన్ పెంచేసింది అని ఇండస్ట్రీ వర్గలు చెప్తున్నాయి