రెజీనా కాసాండ్రా.. తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది.
చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెజీనా, 2005లో తమిళ చిత్రం "కండా నాల్ ముదల్"తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
తెలుగులో "శివ మనసులో శృతి" (2012) ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు "సైమా ఉత్తమ తొలి చిత్ర నటి" అవార్డు కూడా వచ్చింది.
రెజీనా తెలుగులో "రొటీన్ లవ్ స్టోరీ", "పిల్లా నువ్వు లేని జీవితం", "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్", "పవర్" వంటి సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
తమిళంలో "కేడి బిల్లా కిల్లాడి రంగా", "మానగరం" వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు పొందింది.
ఈ భామ బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. 2019లో "ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా" చిత్రంతో హిందీలో ప్రవేశించింది.
మూడు భాషల్లో సినిమాలు చేసినా రెజీనాకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. స్టార్ డమ్ అందుకోవడనికి చాలా కష్టపడుతుంది ఈ భామ.