అందాల భామ కృతిశెట్టి ని టాలీవుడ్ లైట్ తీసుకుందా.? 

Rajeev 

10 july  2025

Credit: Instagram

కృతి శెట్టి  తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది

ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసింది. 

కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. 

కృతిశెట్టికి 2021లో వచ్చిన ఉప్పెనతో గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. 

 ఆ తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది. 

ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి కొన్ని చిత్రాలు కమర్షియల్ గా నిరాశపరిచాయి. 

దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది. మూడు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తోంది