బాలీవుడ్ టూ టాలీవుడ్ ట్రేండింగ్ ఉన్న ఊర్వశీ

బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన ఓ గ్లామర్‌ క్వీన్ ఇప్పుడు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా... స్టార్ హీరోయిన్స్‌కు కూడా తీసిపోని రేంజ్‌లో పేమెంట్ అందుకుంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి బాస్ పార్టీ చేసిన ఊర్వశీ రౌతెల్లా ప్రజెంట్ బ్రోతో కలిసి మరోసారి ట్రెండ్ అవుతున్నారు.

అంతేకాదు సౌత్‌లో స్పెషల్ సాంగ్స్‌ కోసం ఈ బ్యూటీ అందుకుంటున్న పేమెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

బ్లాక్‌ రోజ్‌, లెజెండ్ లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్‌కు చేరువయ్యారు ఊర్వశి.

ప్రజెంట్ అమ్మడి క్రేజ్‌ చూసి ఆ రేంజ్‌లో పేమెంట్ ఇచ్చేందుకు కూడా రెడీ అంటున్నారు మేకర్స్‌.

ఈ మధ్య కాలంలో ఏ పాట అయినా మూడు నాలుగు నిమిషాల నిడివితోనే రూపొందుతున్నాయి.

అంటే ఒక్కో నిమిషానికి కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఊర్వశీ.