ఆ రోజు నుంచి ఓటీటీలోకి ‘హిడింబ’..

6 August 2023

అశ్విన్‌బాబు హీరోగా వచ్చిన చిత్రం  ‘హిడింబ’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 

ఈ చిత్రంలో నందిత శ్వేతా కథానాయక. ఇంతకముందు ఈమె పలువురు యువ హీరోల సరసన నటించింది. 

దర్శకుడు అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన చిత్రమిది. గతంలో 'రన్', 'మిస్టర్ నూకయ్య', 'అసాధ్యుడు' వంటి సినిమాలు తీశాడు. 

జులై 20న ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది.

ఓటీటీ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా ఆగస్టు 10 రాత్రి 7గంటల నుంచి ఆహా  వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది ఆహా.

రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, దీప్తి నల్లమోతు ముఖ్య పాత్రల్లో కనిపించారు.