ప్రేక్షకులంతా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.. అశ్విన్ బాబు..
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘హిడింబ’.
అనిల్ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
గురువారం (జులై 20న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రాన్ని గంగపట్నం శ్రీధర్ నిర్మించగా, అనిల్ సుంకర సమర్పించారు.
ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ తరుణంలో శనివారం హైదరాబాద్లో థాంక్యూ మీట్ నిర్వహించారు.
ఈ మీట్లో హీరో అశ్విన్ ఈ విధంగా మాట్లాడారు.
‘‘ఇలాంటి భిన్నమైన కథతో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనుకున్నాం.
కానీ ప్రేక్షకులంతా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.
ఈ చిత్ర విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి.’’ అని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి