ప్రేక్షకులంతా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.. అశ్విన్‌ బాబు..

అశ్విన్‌ బాబు, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘హిడింబ’.

అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

గురువారం (జులై 20న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రాన్ని గంగపట్నం శ్రీధర్‌ నిర్మించగా,  అనిల్‌ సుంకర సమర్పించారు.

ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ తరుణంలో శనివారం హైదరాబాద్‌లో థాంక్యూ మీట్‌ నిర్వహించారు.

ఈ మీట్‌లో  హీరో అశ్విన్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘‘ఇలాంటి భిన్నమైన కథతో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనుకున్నాం.

కానీ ప్రేక్షకులంతా ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్ర విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి.’’ అని అన్నారు.