యుద్ధ భూమిలో సూర్య.. ‘కంగువ’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల..

సూర్య హీరోగా చేస్తున్న బహుభాషా చిత్రం ‘కంగువ’.

ఈ చిత్రాన్ని శివ తెరకెక్కిస్తున్నారు.

సూర్య జోడిగా దిశా పటాని  ఈ చిత్రంలో నటిస్తుంది.

స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్రాన్ని పది భాషల్లో త్రీడీలో రూపొందిస్తున్నారు.

తాజాగా ఆదివారం సూర్య పుట్టినరోజు పురస్కరించుకొని ఈ చిత్రం గ్లింప్స్‌ విడుదల చేసింది చిత్రబృందం.

ఈ గ్లింప్స్‌లో యుద్ధ భూమిలో సరికొత్త లుక్ లో ఆకట్టుకున్నారు.