‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మొదటి అంకం పూర్తి..

01-August-2023

రామ్‌ - పూరి జగన్నాథ్‌ కాంబోలో వస్తున్న మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.

గతంలో వీరిద్దరి కలయికలో  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.

ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ పతాకంపై ఛార్మి, పూరి జగన్నాథ్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

సంజయ్‌ దత్‌  ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.

కాగా తాజాగా ముంబయిలో చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది.

సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం.

ఈ షెడ్యూల్‌లో రామ్‌పై యాక్షన్‌ సీక్వెన్స్‌  చిత్రీకరించారు.