టాలీవుడ్‏లో తెలుగు రానివారే ఎక్కువగా ఉన్నారు.. ఈషా రెబ్బా..

అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో గుర్తింపు వచ్చింది. 

ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది ఈషా. 

 సుధీర్ బాబు నటిస్తోన్న మామ మాశ్చీంద్ర చిత్రంలో నటిస్తుంది. 

తమిళ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని తెలిపింది. 

అలా తెలుగు గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. 

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు రానివారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది.

ఇతర రాష్ట్రాల వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. 

 కేవలం హీరోయిన్స్ గురించి కాదని.. అన్ని పాత్రల గురించి మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చింది.