డబుల్‌ ఇస్మార్ట్‌ జాతర మొదలు..

రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.

2019లో వచ్చిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.

నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపొందుతుంది.

పూరి కనెక్ట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు.

పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

కాగా ఈ నెల 12 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు మేకర్స్.