జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట..

16 August 2023

Pic credit - Instagram

ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఓ కేసులో నిందితురాలిగా ఉంది.

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో పాటు ఆమెను నిందితురాలిగా ED చేర్చింది.

ఈ మేరకు 2022 నవంబర్‌లో ఆమె విదేశాలకు వెళ్లేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే షరతులతో కూడిన బెయిల్ ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది.

తాజాగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.

ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును సవరించాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు ఆమె లాయర్.

దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్, మాలిక్ వాస్తవాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ బెయిల్ షరతును సవరించాలని నిర్ణయించారు.

నిందితురాలు బెయిల్ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అనుమతించడం జరిగింది.

బెయిల్ ఆర్డర్‌లోని ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని నిర్దారణ కావడంతో  జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట లభించినట్లు అయింది.