నా మూవీ సీక్వెల్లో వీరిద్దరిని జంటగా చూడాలని ఉంది: చిరు..
20 April 2025
Prudvi Battula
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకతంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైజయంతి మూవీస్ సంస్థలో అశ్విని దత్ నిర్మించారు.
అమ్రిష్ పూరి ఇందులో విలన్గా ఆకట్టుకున్నారు. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికి ట్రేండింగ్లోనే ఉంది.
ఈ చిత్రంతో కొత్త లోకాన్ని చూపించి రికార్డు సృష్టించారు దర్శకేంద్రుడు. గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు మెగాస్టార్.
జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి మాట్లాడిన అయన ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరా ఉండాలేనిది కూడా తెలిపారు.
రామ్చరణ్, జాన్వీ కపూర్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి రెండో భాగంలో నటిస్తే చూడాలని ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
అది తన కల అని, నెరవేర్చుకోవడం కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇప్పుడు పెద్ది సినిమా తెరకెక్కుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పవన్ తొలి సినిమా పారితోషకం అంతేనా.?
టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడో తెలుసా.?
ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?