అప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఇప్పుడు ఇలా.. ఈ హీరోయిన్ ఎవరంటే

Rajitha Chanti

Pic credit - Instagram

06 February 2026

సినిమా రంగంలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి పలు రంగాల్లో బిజీ అయిపోయారు.

 హీరోయిన్ ఛార్మీ సైతం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

అందానికి ఆధార్ కార్డు లాంటి ఛార్మీ.. ప్రస్తుతం నిర్మాణ రంగంలో బిజీగా ఉంటుంది. కానీ ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆమె టాప్ బ్యూటీ.

మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నటనతోపాటు గ్లామర్ లుక్స్ లోనూ ఆకట్టుకుంది.

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసి ఇప్పుడు నిర్మాతగా మారి వరుస సినిమాలు నిర్మిస్తూ అటు నిర్మాతగా సక్సెస్ అయ్యింది.

ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి వరుస సినిమాలు నిర్మిస్తుంది. వీరిద్దరు కలిసి దాదాపు 8 సినిమాలు నిర్మించగా రెండు మాత్రమే హిట్టయ్యాయి. 

 మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఛార్మీ.. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. అలాగే ఆమె ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఛార్మీ అందంతోపాటు నటనలోనూ తిరుగులేదు. ఒక సినిమా షూటింగ్ లో దెబ్బ తగిలి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా నటించిదట.