‘భోళా శంకర్‌’ ట్రైలర్‌కు రంగం సిద్ధం..

చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం  ‘భోళా శంకర్‌’.

ఈ చిత్రంలో చిరుకి జోడిగా తమన్నా కనిపించనుంది.

చిరు సోదరిగా కీర్తి సురేష్‌ అలరించనుంది.

మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.

రామబ్రహ్మం సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

కాగా ఈ చిత్రం ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రబృందం.

ఈ మేరకు ఈనెల 27న ట్రైలర్‌ విడుదల విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆదివారం ఈ విషయాన్ని తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.