తీపి కబురు చెప్పిన బాలయ్య.. మోక్షజ్ఞ డెబ్యూ పై క్లారిటీ..

అదుగో పులి.. ఇదిగో మేక అన్నట్లుంది బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం.

కొన్నేళ్లుగా మోక్షజ్ఞ అరంగ్రేట్రం కోసం నందమూరి అభిమానులు వేచి చూస్తున్నారు.

అసలు నందమూరి వారసుడు వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా ఫ్యాన్స్‌లో కలుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో  టైమ్‌లో తీపి కబురు చెప్పారు బాలయ్య.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తనయుడి సినిమా కోసం కథలు వింటున్నారు బాలయ్య.

సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 సీక్వెల్‌తో రాబోతున్నారు మోక్షజ్ఞ.

అమెరికాలో జరిగిన తానా సదస్సులో అభిమానులతో ముచ్చటిస్తూ.. తనయుడి డెబ్యూ గురించి తెలిపారు బాలయ్య.

భగవంత్ కేసరి, బాబీ సినిమాల తర్వాత ఎన్నికలకు సమయం కేటాయించనున్నారు అయన.

ఇవన్నీ అయ్యాక ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999పై ఫోకస్ చేయనున్నారు.