కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్
Phani CH
25 February 2025
Credit: Instagram
ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే.. హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఈమె. ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి.. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వర్య రాజేష్.
ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది.
సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్గా తన కెరీర్ మొదలు పెట్టింది. 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది.
ఇక ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికి వస్తే.. ఐశ్యర్య రాజేష్ విషయానికొస్తే.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది.
తెలుగు భామ అయిన ఐశ్వర్య రాజేష్కు తమిళ్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది.
ఇక తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు.
రీసెంట్గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో నలుగురి పిల్లల తల్లిగా, వెంకటేశ్ భార్యగా నటించి ఆడియన్స్ను మెప్పించింది.