ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార సమంత. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచేసిందీ చెన్నై చిన్నది
ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకుంది. దాదాపు అందరూ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక అనంతరం నాగ చైతన్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే
అయితే నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సామ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది సామ్. ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండే ఈ చిన్నది పలు అంశాలపై మాట్లాడుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన బదులు ఇచ్చింది. గతంలో సామ్ అనారోగ్యకరమైన బ్రాండ్స్ని ప్రమోట్ చేసిన విషయంపై ఓ అభిమాన్ని ప్రశించారు.
దీనికి బదులిచ్చిన సామ్.. గతంలో తాను తప్పులు చేసిన మాట వాస్తవమేనని, అయితే అన్నవీ పూర్తిగా తెలియక చేసినవని చెప్పుకొచ్చారు. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ప్రమోషన్స్ చేయడం ఆపేశానని తెలిపారు.
ఇప్పుడు తాను ఏం చేస్తుందో వాటి గురించి మాత్రమే చెబుతున్నాని సమాధానం ఇచ్చారు. దీంతో సామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే కాగా సమంత నటించిన సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉండగా. మరో వెబ్ సిరీస్లో సామ్ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.