సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
విడుదలైన అన్ని భాషల్లో భారీ సక్సెస్ను అందుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక రష్మికకు ఈ సినిమా ద్వారా ట్రోలింగ్ను సైతం ఎదుర్కొంది.
ముఖ్యంగా ఈ సినిమాలో కర్వాచౌత్ పండగ నేపథ్యంలో వచ్చే ఓ సన్నివేశంలో రష్మిక నటనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రష్మిక డైలాగ్ చెప్పే విధానం బాగా లేదని, ముఖంలో ఎక్స్ప్రెషన్స్, నటన బాగా లేదంటూ సినిమా విడుదలైన సమయంలో భారీగా విమర్శలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ విషయమై రష్మిక ఓపెన్ అయ్యింది. తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్పై స్పందించిన రష్మిక.. ఈ సీన్ ఎంత కష్టపడాల్సి వచ్చిందే తనకే తెలుసు అంది.
తన నటన చూసి సెట్లో, థియేటర్లలో మంచి ప్రశంసలు వచ్చాయని తెలిపిన రష్మిక. 9 నిమిషాల సీన్లో 10 సెకన్ల డైలాగ్ బాగాలేదని ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తాను ఇలాంటి ట్రోలింగ్స్ను అస్సలు పట్టించుకోనని తెలిపిన రష్మిక.. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో తనకు తెలుసని తేల్చి చెప్పింది.
ఎవరి ఇష్టం వారిది అని తెలిపిన రష్మిక, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా అని చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం.. ‘పుష్ప 2’, ‘ది గర్ల్ఫ్రెండ్ సినిమాలో నటిస్తోంది.