13 January 2026

తెలుగులో మెరుపు తీగలా మెరిసి మాయమైన ప్రణీత సుభాష్.. 

Rajeev 

Pic credit - Instagram

ప్రణీత సుభాష్.. టాలీవుడ్ సినిమాల్లో అలా ఓ మెరుపులా మెరిసి మాయమైంది ఈ ముద్దుగుమ్మ

ఏం పిల్లాడో.. ఏం పిల్లదో అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ప్రణీత సుభాష్. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వలేదు  ఈ చిన్నది. 

ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ప్రణీత సుభాష్ కు.. ఆతర్వాత అమ్మడు రూటు మార్చింది. 

సెకండ్ హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. 

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రణీతకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. దాంతో మెల్లగా సినిమాలు తగ్గించింది. 

ప్రస్తుతం పెళ్లి చేసుకొని పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది.