సినిమాల స్పీడ్ తగ్గించిన కీర్తిసురేష్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ

21 November 2025

Pic credit - Instagram

Rajeev 

కీర్తిసురేష్.. 2013లో గీతాంజలి అనే సినిమాతో హీరోయిన్ గా మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఫస్ట్ సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం కథానాయికగా సైమా అవార్డ్ అందుకుంది. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది.

2015 నాటికి కీర్తి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది.

ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. 

2019 నుంచి 2024 వరకు అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది.తెలుగుతోపాటు హిందీలోకి తెరంగేట్రం చేసింది. 

హిందీలో ఆమెకు ఊహించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు. 2024 డిసెంబర్ లో తన చిరకాల స్నేహితుడు ఆంటోని థాటిల్ ను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 

ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.