స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న కుమారి.. 

28 April 2025

Rajeev 

హెబ్బా పటేల్ తన నటన, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. హెబ్బా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 

ఈడో రాకం ఆడో రాకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా , అంధగాడు , 24 కిస్సెస్, ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. 

ఇటీవలే ఓదెల 2లో నటించింది ఈ చిన్నది. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకుంది. 

కుమారి 21ఎఫ్ తర్వాత హెబ్బాకు భారీ క్రేజ్ వచ్చినప్పటికీ, ఆమె తర్వాతి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, దీంతో ఆఫర్లు తగ్గాయి.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది. 

హెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోలు మరియు అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటుంది.