ఎన్నికల గుర్తుగా జంతువులను ఎందుకు ఇవ్వరు?

TV9 Telugu

06 May 2024

భారత ఎన్నికల సంఘం నమోదైన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఎన్నికల కోసం కొన్ని చిహ్నాలను కేటాయిస్తుంది.

ఎన్నికల సంఘం 2009 నుండి మతం, జంతువులకు సంబంధించిన ఎన్నికల చిహ్నాలను ఏ పార్టీకి ఇవ్వకూడదని నిబంధనను రూపొందించింది.

జంతు హక్కుల కార్యకర్తల నిరసనల తరువాత, ఎన్నికల ర్యాలీలలో జంతువులపై క్రూరత్వాన్ని అంతం చేయడానికి ఇలా నిర్ణయించారు.

ఏనుగు ఎన్నికల గుర్తు ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీఎస్పీ. ఎందుకంటే రూల్స్ అమల్లోకి రాకముందే ఈ గుర్తును పార్టీకి ఇచ్చారు.

గోవాలోని మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, మేఘాలయలోని హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీల చిహ్నం సింహం.

ఎన్నికల గుర్తులు రెండు రకాలు. అవి జాతీయ రాజకీయ పార్టీ లేదా రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పార్టీ కోసం రిజర్వ్ చేయడం జరిగింది.

రిజర్వ్ కాకుండా, ఇతర ఉచిత గుర్తులు ఉన్నాయి. వీటి జాబితాను ఎన్నికల సంఘం అన్ని పార్టీల కోసం సిద్ధం చేస్తుంది.

భారతీయ ఎన్నికల సంఘం ఈ గుర్తుల నుండి ఓ గుర్తుని ఏదైనా కొత్త పార్టీకి ఎన్నికల గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది.