TV9 Telugu
28 January 2024
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్గా భారత్కు చెందిన జి త్రిష రికార్డు సృష్టించింది.
మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్-6 మ్యాచ్లో 59 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచింది. అంతేకాదు 3 వికెట్లు కూడా తీశాడు.
ఇంగ్లీష్ కామేంటేటర్ త్రిషను ఇండియన్ ప్లేయర్ అనకుండా.. భద్రాచలం అమ్మాయి అంటూ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.
త్రిష రెండంకెల ప్రదర్శనతో ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది.
త్రిష రెండంకెల ప్రదర్శనతో ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది.
గత ప్రపంచకప్ను భారత్ గెలుచుకుంది. ఆ టీమ్లో త్రిష కూడా ఉంది. కుమార్తె శిక్షణ కోసం తన జిమ్తోపాటు 4 ఎకరాల భూమిని విక్రయించాల్సి వచ్చిందని ఆమె తండ్రి చెప్పారు
త్రిష 5 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ పేరు గొంగడి త్రిష. త్రిష తెలంగాణలోని భద్రాచలం నివాసి.
జనవరి 28న స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 19 ఏళ్ల గొంగడి త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో త్రిష సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచింది.
త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది.
స్కాట్లాండ్పై సెంచరీ చేసిన తర్వాత, త్రిష ICC అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.