03 August 2023
Pic credit - Instagr
am
కోహ్లీని అధిగమించిన గిల్.. ఆ లిస్టులో అగ్రస్థానం..
వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో శుభ్మన్ గిల్ 92 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు బాదాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్కు శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
భారత్ గెలిచిన వన్డేల్లో శుభ్మన్ గిల్ అత్యధిక సగటు సాధించాడు. ఈ విషయంలో సహచర ఆటగాడు విరాట్ కోహ్లీ కంటే శుభ్మన్ గిల్ ముందున్నాడు.
భారత్ తరపున గెలిచిన వన్డేల్లో శుభ్మన్ గిల్ 77.87 సగటుతో పరుగులు చేశాడు.
ఈ జాబితాలో శుభ్మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ సగటు 73.70లుగా నిలిచింది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ 68.60 సగటుతో పరుగులు చేశాడు.
ఆ తర్వాత అంబటి రాయుడు 67.47 సగటుతో పరుగులు చేశాడు.
ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 59.27 సగటుతో పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్ 56.63 సగటుతో పరుగులు సాధించాడు.
ఇక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు జాబితాలో చివరి స్థానంలో ఉంది. గంగూలీ 54.98 సగటుతో పరుగులు సాధించాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..