31-jul-2023

Pic credit - Instagram

రోహిత్ 17, కోహ్లీ 27.. ప్రపంచ కప్ 2023కి ముందు టెన్షన్ పెడుతోన్న దిగ్గజాలు..

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి లభించింది. 

కొన్ని నెలల తర్వాత ప్రపంచ కప్ ఆడాల్సి ఉంది. అంతకు ముందు ఇద్దరు అనుభవజ్ఞులకు విశ్రాంతి ఇచ్చారు. 

టీమిండియా మొత్తం రోహిత్‌, విరాట్‌ కోహ్లీలపైనే ఆధారపడి ఉంది. ఇటువంటి పరిస్థితిలో వారు ఫామ్‌లో ఉండటం చాలా ముఖ్యం.

2019 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 

ప్రస్తుత జట్టు పరిస్థితిని చూస్తుంటే, అభిమానులు ఇంకా 2019 భయంతో ఉన్నారు.

రోహిత్, కోహ్లీ గురించి మాట్లాడితే, రోహిత్ 2019 ప్రపంచ కప్ నుంచి చాలా వన్డేలకు దూరంగా ఉన్నాడు. 

రోహిత్ 2019 ప్రపంచ కప్ నుంచి 27 ODIలకు దూరంగా ఉన్నాడు. 

అయితే అతను 8 ఆగస్టు 2019, 27 జులై 2023 మధ్య 29 ODIలు మాత్రమే ఆడాడు.

అదే సమయంలో విరాట్ కోహ్లీ 2019 ప్రపంచ కప్ నుంచి 17 వన్డేలకు దూరంగా ఉన్నాడు. 

8 ఆగస్టు 2019, 27 జులై 2023 మధ్య రోహిత్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ 39 వన్డేలు ఆడాడు.