ఐపీఎల్ హిస్టరీలోనే ఒక్క మగాడు.. యూవీ శిష్యుడి రేర్ ఫీట్
TV9 Telugu
14 April 2025
ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 30 మ్యాచ్లు పూర్తయ్యాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మెల్లగా తన ఫాంను తిరిగి తెచ్చుకుంటోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఇప్పుడు రన్ చేజ్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్లో రన్ ఛేజింగ్లలో భారీ స్కోరు చేసి, ఏకంగా 355 రోజుల రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
2025 ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్పై అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులతో ఛేజింగ్లో భారీ స్కోరు సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు మార్కస్ స్టోయినిస్ పేరిట ఉంది. అతను 2024 ఏప్రిల్ 23న చెన్నైపై అజేయంగా 124 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఐపీఎల్ 2011లో పాల్ వాల్తాటీ నెలకొల్పిన 13 ఏళ్ల రికార్డును మార్కస్ స్టోయినిస్ బద్దలు కొట్టాడు.
అభిషేక్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించి మరెన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు కొట్టిన తొలి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్గా నిలిచాడు అభిషేక్ శర్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడవ్వని భారత ఆటగాళ్లు వీరే?
5 ఏళ్లపాటు డేటింగ్.. ఆపై వివాహం.. శాంసన్ వివాహంలో ట్విస్ట్ ఏంటంటే?
షోయబ్ అక్తర్ సీన్ రిపీట్ చేసిన పాక్ బౌలర్