ఆఫ్ఘనిస్తాన్‌ చేరిన ఎంఎస్ ధోనీ జెర్సీ.. ఎందుకో తెలుసా?

ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా చాలా మంది క్రికెటర్లు ఎంఎస్ ధోనిని తమ ఆదర్శంగా భావిస్తుంటారు.

వీరిలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్ ఒకరు.

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ధోనీ నుంచి స్పెషల్ బహుమతిని పొందాడు.

ధోనీ తన సంతకం చేసిన జెర్సీని గుర్బాజ్‌కు పంపాడు.

జెర్సీ ఫొటోను గుర్బాజ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

ధోనీతో కలిసి ఆడాలని గుర్బాజ్ చాలా కాలంగా తన కోరికను వ్యక్తం చేశాడు.

గుర్బాజ్ IPL 2023లో KKR తరపున ఆడుతున్నాడు.