విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం

11 October 2023

ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్న కేంద్రం ప్రభుత్వం. 

జాతీయ విద్యా విధానంలో HECI ఏర్పాటును ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం.

వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్నత విద్యారంగానికి సంబంధించి కీలక బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు. 

దేశంలో ఉన్నత విద్యను ఒక తాటి కిందకు తెచ్చి ఏకైక నియంత్రణా సంస్థ పరిధిలో ఉంచేందుకు కేంద్రం చర్యలు.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(HECI) బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి.

మెడికల్‌, లా కాలేజీలు మినహా దేశంలోని అన్ని కళాశాలలు రెగ్యులేటర్‌ పరిధిలో తీసుకువచ్చేలా ప్రణాళికలు. 

నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నెలకొల్పడం అనే మూడు ప్రధాన పాత్రలను పోషించనున్న HECI.

HECI అమలులోకి వస్తే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు రద్దు.

ఇప్పటికే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచిన కేంద్ర ప్రభుత్వం.