'షవర్‌తో కూడిన తొలి వందేభారత్'.. నెటిజన్ చమత్కారం.. కారణమిదే

Ravi Kiran

03 July 2024

వందేభారత్‌ రైలు పట్టాలు ఎక్కినప్పటినుంచి అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శన పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటలో వందేభారత్‌ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలు చూశాం.

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

ఈ రైళ్లలో అందించే ఆహారంలో నాణ్యత లోపాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా వందేభారత్‌ రైలు రూఫ్‌నుంచి వాటర్‌ లీకవుతుండటంతో పలువురు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మధ్య నడిచిన వందే భారత్‌ రైలు నంబర్ 22416లోని ఒక కోచ్‌ నుంచి పైకప్పు నుంచి నీరు కారింది. 

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

దీంతో సీట్లు తడిచిపోవడం, ఆ కోచ్‌ ఫ్లోర్‌ నీటితో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాగా, ఒక వ్యక్తి ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశాడు. 

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. వందే భారత్ రైలు నిర్వహణ తీరు, కోచ్‌ నాణ్యతపై కొందరు మండిపడ్డారు. 

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

‘షవర్‌తో కూడిన తొలి రైలు’ అని మరొకరు చమత్కరించారు. వందే భారత్ రైలులో వసూలు చేస్తున్న ధర ఎక్కువగా ఉన్నప్పటికీ సేవలు లోపభూయిష్టంగా ఉన్నాయని కొందరు విమర్శించారు. 

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..

మరోవైపు నార్తన్‌ రైల్వే దీనిపై స్పందించింది. పైపుల్లో బ్లాక్‌ కారణంగా నీరు లీక్‌ అయినట్లు తెలిపింది. సిబ్బంది ఈ సమస్యను సరి చేసినట్లు వివరణ ఇచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.

వందేభారత్‌ రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌..