సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?

Ravi Kiran

30 May 2024

సుదూర ప్రయాణ సౌకర్యాన్ని, వేగాన్ని గణనీయంగా పెంచడానికి ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు సహాయపడతాయి. ఈ కొత్త రైళ్లపై జూలై నెలలో ట్రయిల్ రన్ చేసి.. ఆ తర్వాత పట్టాలెక్కించనున్నారట.

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. సికింద్రాబాద్ టూ పూణే మధ్య ఈ సర్వీసును ప్రవేశపెట్టాలని భారత రైల్వే యోచిస్తోందట. 

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

ఈ స్లీపర్ రైళ్ల ప్రతి కోచ్‌లో ఇంటర్-కమ్యూనికేటివ్ ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సౌండ్‌ఫ్రూఫింగ్, సెన్సార్ ఆధారిత లైటింగ్, చిన్న ప్యాంట్రీలతో సహా ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. అలాగే వికలాంగులకు అనుకూలమైన బెర్త్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

వందే భారత్ రైళ్లు తమ సెమీ-హై-స్పీడ్ రైలు సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి భారతీయ రైల్వే చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి.

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

సికింద్రాబాద్-పూణే మధ్య ప్రవేశపేట్టే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను భర్తీ చేయనుందట. ఈ రెండు నగరాలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సుమారు 8 గంటల 25 నిమిషాలలో కవర్ చేస్తోంది.

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

ఒకవేళ వందే స్లీపర్ ట్రైన్లు అమలులోకి వస్తే.. ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు కనీసం గంట ముందుగా చేరుకుంటారు. 

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

ప్రస్తుతం, ఐదు వందే భారత్ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు.. 

కాచిగూడ - యశ్వంతపూర్, విజయవాడ - చెన్నై సెంట్రల్. ఈ రైళ్లు 100 శాతానికి పైగా ప్రజా ఆదరణతో విజయవంతంగా నడుస్తున్నాయి.

సికింద్రాబాద్‌కి 'వందే స్లీపర్' రైళ్లు..