19 June 2024
TV9 Telugu
దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రారంభించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.
ముందుగా వాణిజ్య వాహనాలకు, ఆ తరువాత ఈ సాంకేతికత ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు కూడా దశలవారీగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం.
రాబోయే రెండేళ్లలో అన్ని టోల్ ట్యాక్స్ల వద్ద ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని ఇన్స్టాల్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో ఫాస్టాగ్ సేవలు ముగియనున్నాయి.
జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ అవరోధ రహిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణగా ఉంటుంది. వాహనం ప్రయాణించిన కిలోమీటర్ల సంఖ్యను గుర్తించడానికి వాహనం కదలికను ట్రాక్ చేస్తుంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పని చేస్తుంది. టోల్ ట్యాక్స్ సులభతరం కోసం చర్యలు చేపడుతోంది.
ప్రతి టోల్ ప్లాజాలో GNSS వాహనాలను గుర్తించడానికి ముందస్తు రీడర్లతో రెండు లేదా అంతకంటే ఎక్కువ GNSS లేన్లు ఉంటాయి.
జీఎన్ఎస్ఎస్ లేన్లోకి ప్రవేశించే జీఎన్ఎస్ఎస్ కాని వాహనాలకు అదనపు ఛార్జీ. మొదటి మూడు నెలల్లో 2,000 కి.మీ జాతీయ రహదారులపై జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోలింగ్ విధానం అమలు.
వచ్చే తొమ్మిది నెలల్లో 10,000 కి.మీలకు, 25,000 కి.మీ టోల్ హైవేలకు, 15 నెలల్లో 50,000 కి.మీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.