22 June 2024
TV9 Telugu
ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాదిలో జోరు కొనసాగించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.
ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుందని ట్రాయ్ (TRAI) గణాంకాలు తెలిపాయి.
ఇదే నెలలో ఎయిర్టెల్లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరినట్లు ట్రాయ్ (TRAI) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.
ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరగా, ఏప్రిల్ 2024 నాటికి మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లు.
మళ్లీ బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. స్వల్పంగా దిగుతూ వస్తున్న బంగారం ధర గురువారం సాయంత్రం భారీగా పెరిగింది.