Ravi Kiran
07 June 2024
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
వీటి ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా కొత్త సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేనుందట.
వందేభారత్ స్లీపర్ తొలి విడతలోనే సికింద్రాబాద్ - పూణే మధ్య అందుబాటులోకి రానుంది. ఈ వందేభారత్ స్లీపర్ను తొలి విడత ఖరారులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా నిర్ణయం జరిగింది.
సికింద్రాబాద్-పూణే మధ్య ప్రవేశపెట్టే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ను భర్తీ చేయనుందట. ఈ రెండు నగరాలను శతాబ్ది ఎక్స్ప్రెస్ సుమారు 8 గంటల 25 నిమిషాలలో కవర్ చేస్తోంది.
ఇప్పుడు ఆ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రీప్లేస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు రైల్వే అధికారులు. ఆ రైలు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తే.. ప్రయాణ సమయం ఒక గంట తగ్గుతుందట.
దీంతో రద్దీ మార్గంగా ఉన్న సికింద్రాబాద్ - పూణే మార్గంలో కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డు ప్రతిపాదనలు కోరింది.
ఈ మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ కేటాయిస్తే ఆక్యెపెన్సీ పెరుగుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు.