13 August 2023

దేశంలో సరికొత్త మోడళ్లతో కూడిన కార్లు అందుబాటులోకి వస్తున్నాయి

టెక్నాలజీని ఉపయోగించుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కంపెనీలు కార్లు తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది

ఎక్స్‌యూవీ 300లో నూతన వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనుంది

ఇది 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మాడల్‌లో 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్లు ఉన్నాయి. మరెన్నో ఫీచర్స్‌ కూడా ఉన్నాయి

 ఐదు రకాల్లో లభించనున్న ఈ కారు డబ్ల్యూ2 మాడల్‌ ధర 7.99 లక్షలు రూపాయలు నిర్ణయించింది మహీంద్రా అండ్‌ మహీంద్రా

 డబ్ల్యూ4 రకం రూ.8.65 లక్షల నుంచి రూ.10.20 లక్షలలోపు, డబ్ల్యూ6 మాడల్‌ రూ.9.99 లక్షల నుంచి రూ.12.29 లక్షల లోపు ఉండనుంది

డబ్యూ8 మాడల్‌ రూ.11.49 లక్షల నుంచి రూ.14.59 లక్షల లోపు నిర్ణయించింది కంపెనీ

అత్యాధునిక ఫీచర్లను వినియోగించి మార్కెట్లోకి తీసుకువచ్చింది మహీంద్రా కంపెనీ. మోడల్‌, ఫీచర్లను బట్టి ధర ఉంటుంది.