19 August 2023

మార్కెట్‌లోకి సరికొత్త ఆడీ క్యూ8 ఈట్రాన్‌.. సింగిల్‌ చార్జింగ్‌తో 600 కిలో మీటర్లు

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడళ్లను పరిచయం చేసింది

అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే భారత్‌లో విడుదల చేయడం విశేషం

నాలుగు రకాల్లో లభించనున్న ఈ మాడళ్లలో 50 ఈ-ట్రాన్‌ ధరను రూ.1.13 కోట్లు, స్పోర్ట్‌బ్యాక్‌ 55 ఈ-ట్రాన్‌ రూ.1.18 కోట్లు

55 ఈ-ట్రాన్‌ ధర 1.26 కోట్లు రూపాయలు, స్పోర్ట్‌బ్యాక్‌ 55 ఈ-ట్రాన్‌ ధరను 1.30 కోట్ల రూపాయాలుగా ఉన్నాయి

బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వ్యారెంటీ ఉంటుందని  కంపెనీ తెలిపింది

మై ఆడీ కనెక్ట్‌ కింద వెయ్యికి పైగా చార్జింగ్‌ పాయింట్ల వద్ద ఉచితంగా చార్జింగ్‌ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది

ఆటోమొబైల్‌ రంగంతో తొలిసారిగా 2 చార్జర్లు వీటిలో రెండు మోడళ్లు కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనున్నాయి

మరో రెండు  మోడళ్లు కేవలం 6 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి