12 January 2024
TV9 Telugu
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాహ కొనసాగుతోంది. ఈవీ వాహనాల సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
ఈ ఏడాది చివరినాటికి తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.750 కోట్ల లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్, మాడ్యుల్స్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు మారుతి సుజుకీ
ఈ ఏడాదిలోనే దేశీయ మార్కెట్లోకి ఈవీని విడుదల చేయడంతోపాటు యూరప్, జపాన్ దేశాలకు ఎగుమతి చేసే ఆలోచన కూడా సంస్థకు ఉన్నదన్నారు ఈడీ రాహుల్ భారతి
గుజరాత్లో తోషిబా కార్పొరేషన్, డెన్సో కార్పొరేషన్, సుజుకీ మోటర్ కార్పొరేషన్లు కలిసి లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాయి.
మారుతీ సుజుకీ తీసుకువచ్చే ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యాధునిక ఫీచర్స్ను జోడించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎండీ రాహుల్ భారతి తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది.