20 August 2023

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా లక్ష కార్ల రీకాల్‌

 ఎక్స్‌యూవీ700 వాహన వినియోగదారులకు షాకిచ్చింది. వాహనంలో సమస్య తలెత్తడంతో రీకాల్‌కు  ఆదేశాలు

వైరింగ్‌ సమస్యలు తలెత్తడంతో లక్ష యూనిట్ల ఎక్స్‌యూవీ700 మాడళ్లను రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటన

జూన్‌ 8, 2021 నుంచి జూన్‌ 28, 2023 లోపు ఉత్పత్తి అయిన 1,08,306 యూనిట్ల ఎక్స్‌యూవీ700 వాహన వైరింగ్‌ విషయంలో లోపాలు

 ఈ వైరింగ్‌ లోపాలను గుర్తించిన కంపెనీ ఆ వాహనాలన్నింటిని రీకాల్‌కు ఆదేశాలు

రీకాల్‌ చేసిన వాహనాలలో లోపాలను సరిద్ది తగు మార్పులు చేసి వినియోగదారులకు తిరిగి అందజేయనుంది కంపెనీ

వీటితో పాటు ఫిబ్రవరి 16, 2023 నుంచి జూన్‌ 5, 2023 లోపు తయారైన 3,560 యూనిట్ల ఎక్స్‌యూవీ400 వాహనాలను కూడా వెనక్కి

ఈ వాహనాల్లో బ్రేక్‌ పొటెన్షియోమీటర్‌ స్ప్రీంగ్‌ రిటర్న్‌ యాక్షన్‌లో లోపాలు ఉన్నట్లు అనుమానాలున్నాయని కంఎనీ పేర్కొంది

ఈ కార్లను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా మరమ్మత్తులు చేసి, అవసరమైన విడిభాగాలను ఉచితంగా అందించనుంది