6 స్టాప్‌లు.. 11 గంటలు.. ఈ వందేభారత్ రూటే సెపరేటు..

Ravi Kiran

27 October 2024

సాధారణంగా దూర ప్రాంతాల రైలు ప్రయాణం.. ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ దూరం కూడా దగ్గరయ్యింది. 

ఈ వందేభారత్ రూటే సెపరేటు..

12 గంటలు ఆపై ప్రయాణాన్ని కూడా 8 గంటలలోపే వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నారు ప్రయాణీకులు. మీకు ఇది తెల్సా.. దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఓ వందేభారత్ రైలు ఉంది.. దీపావళి గిఫ్ట్‌గా పట్టాలెక్కనుంది

ఈ వందేభారత్ రూటే సెపరేటు..

ఢిల్లీ టూ పాట్నా.. భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఈ రెండు నగరాల మధ్య నడవనుంది. ఈ సిటీల మధ్య ఉన్న 1000 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 11 గంటల 35 నిమిషాలలో కవర్ చేస్తుంది.

ఈ వందేభారత్ రూటే సెపరేటు..

ఈ రైలు అక్టోబర్ 30న పట్టాలెక్కనుండగా.. న్యూఢిల్లీ నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం నడవనుండగా.. పాట్నా నుంచి సోమవారం, గురువారం నడవనుంది.

ఈ వందేభారత్ రూటే సెపరేటు..

ఢిల్లీ నుంచి ఉదయం 8.25 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్.. పాట్నాకి రాత్రి 8 గంటలకు చేరుతుంది. పాట్నా నుంచి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.

ఈ వందేభారత్ రూటే సెపరేటు..

ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్‌డయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ స్టాప్‌లలో ఆగుతుంది.

ఈ వందేభారత్ రూటే సెపరేటు..