01 September 2023

జియో బంపర్ ఆఫర్ కేవలం రూ.999లకే 4G ఫోన్‌..! 

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. 

 మధ్య తరగతి వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో భారత్ 4జీ ఫోన్ లాంఛ్ చేసింది. 

జియో భారత్ 4జీ ఫోన్ ధర కేవలం రూ.999 గా నిర్ణయించింది. 

అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో జియో భారత్ 4జీ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 

ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా మాత్రే కొనుగోలు చేసేందుకు వీలుంది. 

ఇప్పటికీ 2G ఫోన్లను వాడుతున్న వారికి తక్కువ ధరలో లభించే జియో భారత్‌‌ పట్ల డిమాండ్ పెరుగుతోంది.

ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ సేవలు అందాలన్న లక్ష్యంతో జియో భారత్ 4G ఫోన్లను పరిచయం చేసింది. 

భారత్‌లోని వినియోగదారుల విభిన్న భాషా ప్రాధాన్యతల్లో భాగంగా 23 భాషలతో కూడిన అప్షన్లు ఇందులో చేర్చారు. 

జియో భారత్ 4జీ ఫోన్‌లలో Jio Pay ద్వారా UPI లావాదేవీలు జరుపుకునే అవకాశం కల్పించారు

జియో సినిమా, FM రేడియో, జియో సావన్ ఫీచర్స్‌తో అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను రూ. 999 కే ఆఫర్ చేస్తుంది.