నిర్మలమ్మ పద్దులో గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు

23 July 2024

TV9 Telugu

మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పలు రంగాలకు పెద్ద పీట వేసింది కేంద్రం.

మోడీ సర్కార్ 2024 వార్షిక బడ్జెట్‌

 వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

వరుసగా ఏడో సారి

నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్‌లో పలు రంగాల వారికి ఉపశమనం కలిగింది. వివిధ రకాల వస్తువుల ధరలు కూడా తగ్గింపు కానున్నాయి.

ఈ వార్షిక బడ్జెట్‌లో

ఈ నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించారు.

బంగారం, వెండి

బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గిస్తూ ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 

బంగారం, వెండిపై సుంకం

గతంలో 10 శాతం ఉండగా.. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ పై 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.

ప్రస్తుతం గోల్డ్, సిల్వర్

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను కూడా తక్కువ ధరకు అందజేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీ ఫుడ్స్, తోలుతో చేసిన వస్తువులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. 

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు

బంగారం, వెండితో చేసిన ఆభరణాలు కూడా చౌకగా మారనున్నాయి. అంతేకాకుండా మూడు క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మార్చారు. వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి.

బంగారం, వెండితో చేసిన