ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు.. ప్రయాణ తేదీ మారిస్తే చాలు.!

Ravi Kiran

03 June 2024

చాలామందికి చివరి క్షణాలలో వారి ప్రయాణం వాయిదా పడుతుంటుంది. దాంతో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, ఇక టిక్కెట్ రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

బదులుగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. రైళ్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది ఇండియన్ రైల్వేస్. తాజాగా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

చాలామంది ప్రజలు తమ ప్రయాణానికి కొంతకాలం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ప్రయాణ సమయం దగ్గర పడగానే ప్లాన్ మార్చుకుని టికెట్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

ఇక టిక్కెట్ రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు బయల్దేరే 48 గంటల ముందు మీ టికెట్లను రిజర్వేషన్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

అక్కడ మీరు ఇంకో కొత్త తేదీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు తరగతిని అప్‌గ్రేడ్ చేసే ఆప్షన్ కూడా పొందుతారు. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

దరఖాస్తును స్వీకరించిన తర్వాత, మీ ప్రయాణ తేదీ, తరగతి రెండూ మారుస్తారు. తేదీని మార్చినందుకు అదనంగా ఎలాంటి రుసుము తీసుకోరు. 

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..

అయితే, తరగతిని మార్చినట్లయితే, ఆ తరగతి ఛార్జీల ఆధారంగా డబ్బు వసూలు చేస్తారు.

ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోవద్దు..