18 August 2023

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. రైలు ఛార్జీలతో విమానంలో ప్రయాణం. 

 ఎయిర్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇది కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రత్యేక సేల్‌లో దేశీయ రూట్లలో టిక్కెట్లు కేవలం రూ.1,470 నుంచి ప్రారంభమవుతున్నాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

ఈ సేల్‌లో దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ సేల్ 96 గంటలు మాత్రమే.

దేశీయ విమానాల కోసం రూ.1,470 వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్‌, దేశీయ విమానాలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు రూ.10,130 నుంచి ప్రారంభం.

అంతర్జాతీయ విమానాల కోసం కూడా కంపెనీ ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను అందించింది.

ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి కన్వీనియన్స్ రుసుము ఉండదు

 ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక విక్రయం ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. 

ఈ సేల్‌లో మీరు 1 సెప్టెంబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 మధ్య ప్రయాణానికి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.