కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి

KCR: అదే కాంగ్రెస్‌ను ముంచెయ్యబోతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో BRS అత్యధిక స్థానాలు గెలవబోతోంది.. రెండు జాతీయ పార్టీలను మించి BRS అద్భుత విజయం సాధించబోతోంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చాలా తప్పులు చేశారు.. ప్రభుత్వాలు మారితే.. గత ప్రభుత్వం కంటే బాగా పనిచెయ్యాలి.. కానీ.. అనేక ముఖ్య విషయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయాలు చేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు.

KCR Press Meet: కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన ప్రెస్‌ మీట్

లోక్ సభ పోలింగ్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

Khammam: ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?

Khammam Lok Sabha constituency: ఖమ్మానికి పొలిటికల్ గేట్ వే అని పేరు. తెలంగాణ మొత్తానిది ఒక దారి.. ఖమ్మంది మరో దారి అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ మలి ఉద్యమం ఉధృతంగా సాగినా సరే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ వైపే ప్రజలు నిలబడ్డారు. 2014లో, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు ఇక్కడి ప్రజలు.

’12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం’.. మాజీ మంత్రి కేటీఆర్..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా హీటెక్కిస్తోంది. నేతల మధ్య హాట్ హాట్‌గా విమర్శలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ హామీలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 8:26 am

‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే’.. ప్రచారంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. 48 గంటల తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ వీణవంకలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 9:52 pm

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్… పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు.

PM Modi: కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కామెంట్‎పై మోదీ స్పందన..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు మోదీ.

  • Srikar T
  • Updated on: May 2, 2024
  • 10:03 pm

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది.

  • Srikar T
  • Updated on: May 1, 2024
  • 7:27 pm

KCR: కేసీఆర్‌ చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమికి ఈసారి నంబర్‌ తగ్గుతుందా..? బీజేపీ, కాంగ్రెస్‌ లేని కూటమి సాధ్యమేనా?

గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తాజాగా కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్తరాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందనీ, ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్‌ తీసుకుంటున్నవేళ, తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్‌.

KCR: భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. రోడ్డు పక్కన గుడిసె హోటల్‌లో బజ్జీలు తింటూ కనిపించిన గులాబీ బాస్

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన.. ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపించారు. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు సేదతీరారు. హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు.

Watch Video: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‎పై విమర్శలు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు.

  • Srikar T
  • Updated on: Apr 28, 2024
  • 9:54 pm

Revanth Reddy: 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. బీజేపీ- బీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బయటపడింది.. ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి.. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. అంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై సంచలన ఆరోపణలుచేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలుచేశారు.

KTR: కాంగ్రెస్‌కు ఓ విధానం ఉందా? వాళ్లను ఏమనాలో అర్ధం కావట్లేదన్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

రేవంత్‌ రెడ్డి ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది.. ఎన్నికల ముందు అభయహస్తం.. ఇప్పుడు భస్మాసురహస్తం రేవంత్‌ నైజం..అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రుణమాఫీ అని డిసెంబర్‌ 9 వరకు మోసం 1 చూపించారు.. ఇప్పుడు ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ అంటూ మోసం 2 చూపిస్తున్నారు.. అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

Watch Video: తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

తెలంగాణలో కరెంట్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేశామన్నారు.

  • Srikar T
  • Updated on: Apr 27, 2024
  • 4:33 pm