ధోని… నీ చెత్త ఆటకే ఓడిపోయాం – యువీ తండ్రి

వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ధోనిని ఉద్దేశించి యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ పేస్ బౌలర్ యోగ్‌రాజ్ సింగ్ తాజాగా క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సెమీఫైనల్‌లో ఓడిపోవడానికి ధోనీయే కారణం అని ఆయన మండిపడ్డారు. చివరి ఓవర్లలో స్లో బ్యాటింగ్‌ చేసి జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని.. అందువల్లే అతడు భారీ షాట్స్ కొట్టడానికి ట్రై  చేసి […]

ధోని... నీ చెత్త ఆటకే ఓడిపోయాం - యువీ తండ్రి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2019 | 2:09 PM

వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ధోనిని ఉద్దేశించి యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ పేస్ బౌలర్ యోగ్‌రాజ్ సింగ్ తాజాగా క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సెమీఫైనల్‌లో ఓడిపోవడానికి ధోనీయే కారణం అని ఆయన మండిపడ్డారు. చివరి ఓవర్లలో స్లో బ్యాటింగ్‌ చేసి జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని.. అందువల్లే అతడు భారీ షాట్స్ కొట్టడానికి ట్రై  చేసి పెవిలియన్‌కు చేరాడని ఆరోపించాడు.

జడేజా తన స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి భారీ షాట్స్ ఆడుతుండగా.. ధోని మాత్రం తన ఆటతీరును విరుద్ధంగా ఆడాడని దుయ్యబట్టారు. అటు స్పిన్నర్లపై దాడి చేయాలంటూ పాండ్యకు ధోని చెప్పడం సరికాదని అన్నారు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడిన ధోనికి ఏ సమయంలో ఎలా ఆడాలో ఆ మాత్రం తెలియకపోవడం చాలా విచారకరమని స్పష్టం చేశారు. మంచి బంతులు పడినప్పుడు కూడా ధోని వాటిని సిక్సర్లగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడని యోగ్‌రాజ్ సింగ్ విమర్శించారు.