వైసీపీకి 150 సీట్లు కన్ఫార్మ్!- బొత్స
ఓడిపోతానని తెలిసి..చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ఇక అవి చెల్లవని.. మే 23వ తేదీన వెలువడే ఫలితాల్లో వైసీపీకి 150 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. స్ట్రాంగ్రూమ్లో ఉన్న ఈవీఎంలను మేం ట్యాంపరింగ్ చేస్తామనే అనుమానాలుంటే.. సీఎం చంద్రబాబు అక్కడే పడుకోవాలని సెటైర్లు వేశారు. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న బొత్స… స్పీకర్ పై డాడి ఘటనలో అంబటి రాంబాబు అక్కడ […]
ఓడిపోతానని తెలిసి..చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ఇక అవి చెల్లవని.. మే 23వ తేదీన వెలువడే ఫలితాల్లో వైసీపీకి 150 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. స్ట్రాంగ్రూమ్లో ఉన్న ఈవీఎంలను మేం ట్యాంపరింగ్ చేస్తామనే అనుమానాలుంటే.. సీఎం చంద్రబాబు అక్కడే పడుకోవాలని సెటైర్లు వేశారు. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న బొత్స… స్పీకర్ పై డాడి ఘటనలో అంబటి రాంబాబు అక్కడ లేకపోయినా కేసులు పెట్టడం దారుణమైన విషయం అన్నారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కొత్త డ్రామాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబుకు ఇబ్బంది అనిపించని ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయే అర్థం కావట్లేదన్నారు. ప్రజలు తిరస్కరించాక కూడా చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారంటూ బొత్స విమర్శించారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని..అందుకే మహిళల ఓట్లు కూడా జగన్కే పడ్డాయని తెలిపారు.