ఒంగోలులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
ఒంగోలులో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంతో ఉద్రిక్త వాతావరణ౦ నెలకొ౦ది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రణరంగంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కమ్మపాలెంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. ఆయన రాకను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు.. బాలినేనిని కమ్మపాలెంలోకి రానివ్వబోమంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో భారీగా పోలీసుల్ని మోహరించారు. కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పినా వెనక్కు […]
ఒంగోలులో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంతో ఉద్రిక్త వాతావరణ౦ నెలకొ౦ది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రణరంగంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కమ్మపాలెంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. ఆయన రాకను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు.. బాలినేనిని కమ్మపాలెంలోకి రానివ్వబోమంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించారు.
ఇరుపార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో భారీగా పోలీసుల్ని మోహరించారు. కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పినా వెనక్కు తగ్గలేదు. దీంతో పరిస్థితి లాఠీఛార్జ్కు దారి తీసింది. ఈ గొడవలో కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసరడంతో ఇద్దరు పోలీసులకు, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బాలినేనిని కమ్మపాలెం వెళ్లకుండా పోలీసులు కోర్టు సెంటర్లో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకుంటున్నారని, పార్టీ ఆఫీసు ప్రారంభిస్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. పరిస్థితి సద్ధుమణగడంతో బాలినేని వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.