వలంటీర్లు అంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటారే?..బాబుపై విజయసాయి ఫైర్
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు. వలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతగా దిగజారి పోయారు @ncbn గారు. వలంటీర్ల పేరు వింటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు. […]
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు. వలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
ఎంతగా దిగజారి పోయారు @ncbn గారు. వలంటీర్ల పేరు వింటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు. అతడినేమో దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మంది పిల్లలపై నిందలు వేస్తారా? @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 29, 2019
350 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై @ncbn గారికి కడుపు మంట స్టార్ట్ అయింది. 9 సంస్థలు ముందు కొచ్చాయని ఆర్టీసి చెప్పింది. అక్టోబరు14న టెక్నికల్, నవంబరు 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సిఉంది. అప్పుడే 7500 కోట్ల క్విడ్ ప్రో కో జరిగిందని కల వచ్చిందట. ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ. @ysjagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 29, 2019
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చ దండుకు కంటిమీద కునుకు లేదు. సంస్థను దివాలా తీయించి జీతాలు చెల్లించలేని దుస్థితికి నెట్టిన వారు ఉచిత సలహాలిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల లీజు ప్రక్రియ పైన, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారని ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 29, 2019