ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయి : వైసీపీ ఎంపీ చంద్రశేఖర్
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని అడ్డుకునేలా కోర్టుల నుంచి స్టేలు తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతి భూములు, పేదలకు ఇళ్ళ పట్టాలు.. ఇలా ప్రతి అంశంలో స్టేలు తెచ్చుకుంటూ అడ్డుకుంటున్నారని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను బయటకు తీసే ప్రయత్నం చేస్తే గ్యాగ్ […]
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని అడ్డుకునేలా కోర్టుల నుంచి స్టేలు తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతి భూములు, పేదలకు ఇళ్ళ పట్టాలు.. ఇలా ప్రతి అంశంలో స్టేలు తెచ్చుకుంటూ అడ్డుకుంటున్నారని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను బయటకు తీసే ప్రయత్నం చేస్తే గ్యాగ్ ఆర్డర్ తో అడ్డుకున్నారన్నారు.
హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం కోర్టుని ఆశ్రయించామని.. అమరావతి భూములు, దేవాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ చేయించాలంటూ పార్లమెంట్ లో పోరాడుతున్నామని ఎంపీ వెల్లడించారు. దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో దొంగే దొంగ అన్నట్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీకి రాజీనామా చేసి ఎంపీ రఘురామకృష్ణారాజు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.